మనవార్తలు , శేరిలింగంపల్లి :
అజాధికా అమృత్ మహోత్స కార్యక్రమంలో భాగంగా రోజు రాయదుర్గం లో వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, నాయకులు కల్సి నాగార్జున స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ మహానుభావుల వేశాడారణలతో ఆకట్టుకున్నారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ 75 మీటర్ల పొడవు గల భారీ జాతీయ పతాకాన్ని ఊరేగించారు. తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున హై స్కూల్ విద్యార్థుల తో పాటు కరస్పాండెంట్ భరత్ కుమార్, ప్రిన్సిపాల్ సుందరీ, కృష్ణయ్య గౌడ్, రాయదుర్గం సి.ఐ తిరుపతి, ఎస్.ఐ నదీమ్, ట్రాఫిక్ పోలీస్ శ్రీనాధ్, తెరాస నాయకులు భీష్మా రెడ్డి, వినయ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జి.వి.ఆర్, న్యూ బ్లూమ్ స్కూల్, ఇండియన్ పీపుల్, శ్రీ విద్యాభారతి స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.