మనవార్తలు ,రామచంద్రపురం:
రామచంద్రపురం శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం రోజున శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కంజర్ల కృష్ణమూర్తి చారి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రొటెం చైర్మన్ శ్రీ భూపాల్ రెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్ లు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజలో, బోనాల ఉత్సవం లో గూడెం మధుసూదన్ రెడ్డి, తొంట అంజయ్య,యాదగిరి యాదవ్ ,విజయ్ కుమార్, ఎన్ నర్సింగ్ గౌడ్, చిత్తారి, పరమేష్ యాదవ్, గోవింద్, చిన్న, పి నర్సింహా రెడ్డి, లు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం సభ్యులు- కొల్లోజు కృష్ణ చారి, వడ్ల శంకరాచారి, ఇతర కార్యవర్గ సభ్యులు రాణోజు మధుపంతులు,పాతూరి వడ్ల రాము చారి, వడ్ల రాజేందర్ చారి, రాష్ట్ర నాయకులు భరత్ చారి లు విచ్చేసి అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు, కంజర్ల కృష్ణమూర్తి చారి విచ్చేసిన ప్రముఖులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం సభ్యులు ప్రభాకర్ చారి ,రాజేందర్ చారి, శ్రీనివాస్ చారి, రవి చారి ,సాయన్న చారి, సాయి చారి, శీను చారి ,దాసు చారి, సాయి వెంకట హర్ష చారి ,దినేష్ చారి, దుర్గా చారి ,నిరంజన్ చారి, భూషణం చారి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని కంజర్ల కృష్ణ మూర్తి చారి తెలిపారు.