ప్రమాదంలో బాలుడు మృతి, ఆర్థిక సహాయం అందచేసిన టీఆర్ఆర్ ప్రజాసేవ ఫౌండేషన్

Districts politics Telangana

మనవార్తలు , బొల్లారం:

బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో ఆదివారం చిన్న బాలుడు ఆడుకుంటూ రోడ్డుమిదకు వచ్చిన సమయంలో ఉల్లిపాయలు అమ్ముకునే ఆటో ఢీ కొట్టడంతో ఘటన స్థలంలోనే మృతి చెందిన బాలుడు.మృతి చెందిన బాలుడు కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని, బాలుడు తండ్రి రాంబాబు మిశ్రాకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన టీఆర్ఆర్ ప్రజాసేవ ఫౌండేషన్ సభ్యులు.టీఆర్ఆర్ ప్రజాసేవ ఫౌండేషన్ అధ్యక్షులు తుపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మేము ఆర్థిక ఇబ్బందిలో వున్నా వాళ్ళకోసం ఎల్లప్పుడూ ఆదుకోవడానికి మేము ముందుటమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షలు కే. లక్ష్మణ్ స్వామి,ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి,సభ్యులు రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *