ఫార్మసీ , ఫార్మాస్యూటికల్ సెన్సైస్పె జాతీయ సదస్సు ….

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు;

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఆగస్టు 5 , 2022 న ‘ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ ‘ ( సీపీపీఎస్ -2022 ) పై ఒక రోజు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ‘ డేటా సెన్స్ , ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ ) ఫ్లెక్సిబుల్ ప్రొడక్షన్ ‘ నేపథ్యంలో దీనిని నిర్వహించనున్నట్టు తెలిపారు . సీఎస్ఐఆర్ సౌజన్యంతో , భారత ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తెలంగాణ శాఖ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నామన్నారు . ఆరోగ్య సంబంధిత ఏఐ వినియోగం ప్రాథమిక లక్ష్యం క్లినికల్ టెక్నిక్లు , రోగి ఫలితాల మధ్య సంబంధాలను విశ్లేషించడమని ఆయన చెప్పారు .

ఇండస్ట్రియల్ ఫ్లెక్సిబుల్ మాన్యుప్యాక్చరింగ్ సిస్టమ్ ( ఎఫ్ఎంఎస్ ) రోబోట్లు , కంప్యూటర్ – నియంత్రిత యంత్రాలు , ఉత్పాదక పరిశ్రమల ఉత్పత్తి విభాగంలో రోబోట్ల ఉపయోగం , అధిక వినియోగం నుంచి అధిక ఉత్పాదకత వరకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుందని ఆయన వివరించారు . అమూర్త పత్రాలను రాతపూర్వకంగా సమర్పించాలని , ఫార్మాస్యూటిక్స్ – బయో – ఫార్మాస్యూటిక్స్ , అధునాతన , ఎంపికచేసిన ఔషధాల రవాణా , నానోటెక్నాలజీ – నానోమెడిసిన్ , ఫెట్రోకెమిస్ట్రీ వంటి వివిధ రంగాలలో పరిశోధనలు చేస్తున్న వారినుంచి నీటిని ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ వెల్లడించారు . ఆసక్తిగల అభ్యర్థులు అమూర్త పత్రాలను జూలై 18 వ తేదీలోగా సమర్పించాలని , జూలై 20 లోగా పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు . ఇతర వివరాల కోసం డాక్టర్ కింగ్స్టన్ రాజయ్య , నిర్వాహకుడు , 09257 , krajiah@gitam.edu కు లేదా డాక్టర్ జితేందర్ పాటిల్ , నిర్వాహక కార్యదర్శి jpatel@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *