హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మెట్టు శ్రీధర్

Districts politics Telangana

మనవార్తలు , సంగారెడ్డి

నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్రో రైల్ సాధన సమితి సభ్యుడు మెట్టు శ్రీధర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నియమించారు. ఈ మేరకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు .ఈ సంధర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ నాపై ఇంత నమ్మకాన్ని ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై స్పందించే తనకు ఇపుడు తనకు మరొక భాధ్యత పెరిగిందని మానవహక్కులకు సంబంధిచి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అవి ఉల్లంఘనకు గురైనపుడు ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు తెలియజేసే విదంగా పనిచేస్తానని అలాగే ఒక వారంలో జిల్లా స్తాయి కమిటీని రూపొందించనున్నట్టు తెలిపారు. పలువురు మెట్టు శ్రీధర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రేటరీ న్యాయమూర్తి మురళి మోహన్ ,అశోక్ శ్యాం ప్రసాద్ మాధవి ,అడ్వకేట్ వైశాలి రజని, సతీష్ ,కృష్ణారెడ్డి షేక్ బాబా బైరవచారి వివిధ జిల్లాల అధ్యక్షులు అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు .

హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నా _ నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *