మనవార్తలు ,అమీన్పూర్:
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు పురాతన ఆలయాలను జీర్ణోద్ధారణ చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నరేంద్ర నగర్ కాలనీ జివ్వి గుట్ట పైన నూతనంగా నిర్మించిన శ్రీ రాధా కృష్ణ స్వామి మరియు శివాలయం ఆంజనేయ గరుడ ఆలయంలో సోమవారం ఏర్పాటు చేసిన రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపుర నిర్మాణానికి తొమ్మిది లక్షల రూపాయల భూరి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవచింతన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.