జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలును పురస్కరించుకొని మెగా బ్లడ్ డొనేషన్

Districts politics Telangana

మనవార్తలు ,ఆమీన్పూర్:

జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలును పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా, అమీనపూర్ మండలం లో బీరంగూడ మార్కెట్లో ఎన్టీఆర్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించిన దివ్వాల మురళీ క్రిష్ణ మరియు బెల్లంకొండ హరి కృష మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణం నిలిబెట్టే వాళ్ళం అవుతామని రక్తం ఇవ్వడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

జీవన చక్రంలో సాధారణంగా జరిగే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. రక్తదానంపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలి.ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు దివ్వాల మురళీ క్రిష్ణ మరియు బెల్లంకొండ హరి కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో సాయి,సత్య,దాస్,తరుణ్ వాళ్ల మిత్రబృందం.పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *