కృషి డిఫెన్స్ కాలనీ లో మిషన్ భగీరథను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రతి కాలనీకి విస్తరిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పటాన్చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీ లో ఇంటింటికి మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీవాసులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన పటాన్చెరు నియోజకవర్గం నేడు గేటెడ్ కమ్యూనిటీ లకు సెంటర్ గా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నూతన కాలనీలకు మిషన్ భగీరథ విస్తరించాలని జలమండలి అధికారులను కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *