మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ( జీఎస్బీ ) హెదరాబాద్ ఆధ్వర్యంలో 26-27 మే 2022 న ‘ ఎమోషనల్ ఇంటెలిజెన్స్’పై రెండు రోజుల ఇ – మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ యాజమాన్య వికాస కార్యక్రమంలో పాల్గొనే వారికి వ్యక్తిగత , వ్యక్తుల మధ్య ప్రభావానికి దారితీసే నెపుణ్యాలను అభివృద్ధికి దోహదపడుతుందన్నారు . పని ప్రదేశంలో భావోద్వేగ మేధస్సు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం , స్వీయ సంబంధాలను అర్థం చేసుకునే మార్గాలను తెలుసుకోవడం , సమర్థమైన నిర్వహణను అలవరచుకోవడం , సామాజిక అవగాహనను పెంపొందించుకోవడం , నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం వంటివి ఈ కార్యక్రమ లక్ష్యాలుగా ఆయన పేర్కొన్నారు .
ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న జూనియర్ , సీనియర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఉద్దేశించినట్టు డాక్టర్ కరుణాకర్ తెలిపారు . ఇందులో పాల్గొనే వారందరికీ ఇ – సర్టిఫికెట్ జారీచేస్తామన్నారు . పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నందున ముందొచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు . ఆసక్తి గల అభ్యర్థులు ( https://forms.gle/ X64fYE11erCdeeth8 ) లింక్ ద్వారా దరఖాస్తును పూరించడం తప్పనిసరన్నారు . పేర్ల నమోదు , ఇతర వివరాల కోసం డాక్టర్ కె.ఎన్ . రేఖ , అసిస్టెంట్ ప్రొఫెసర్ , 91600 93544 ను సంప్రదించాలని లేదా rkrishna3@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని జీఎస్బీ డెరైక్టర్ సూచించారు