పోచారం మల్లన్న జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో సోమవారం నిర్వహించిన మల్లన్న స్వామి జాతర లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరలు తెలంగాణ సంసృతికి, ప్రతీకగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్రం వచ్చాక దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నాడని అన్నారు.

ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి , జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *