లక్డారం లో సి సి రోడ్డు పనులకు శంకుస్థాపన హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్చెరు

పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో రెండు కోట్ల 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న బైపాస్ సిసి రోడ్డు నిర్మాణ పనులకు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రోడ్డు నిర్మాణానికి క్రషర్స్ అసోసియేషన్ సహకారం అందించడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. నూతన రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలతో పాటు క్రషర్ ల పరిశ్రమలకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, క్రషర్ అసోసియేషన్ ప్రతినిధులు, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *