నవభూమి పత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన_ పఠాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

Districts politics Telangana

మనవార్తలు , సంగారెడ్డి :

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గం సంబందించిన నూతన సంవత్సర క్యాలెండరును పఠాన్ చెరు నియోజకవర్గం నవభూమి పేపర్ ఇంచార్జి నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో 2022వ నూతన సంవత్సరం రోజునా శనివారం ఉదయం పఠాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు .ఈ సందర్బంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుటతూ నవభూమి పత్రిక యజమాన్యానినికి ,వారి స్టాఫ్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ టీఆర్ఎస్ జిల్లా నాయకులు మరియు కౌన్సెలర్ వి. చంద్రారెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ బి.రాజ్ గోపాల్,2వ వార్డ్ కౌన్సెలర్ వి. గోపాలమ్మ వెంకటయ్య,1వ వార్డ్ కౌన్సెలర్ పి.చంద్రయ్య, ఖాజీపల్లి సర్పంచ్ చిట్ల సత్యనారాయణ,మాజీ ఎంపీటీసీ క్రిష్ణం రాజు, నాయకులు నరసింహారాజు,బొల్లారం మున్సిపల్ బీసీ అధ్యక్షులు చక్రపాణి, జిన్నారం మండల్ అధ్యక్షులు నాయికోటి రాజేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *