_గోన్నెమ్మ యూత్ యూత్ రూమ్
_నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
పటాన్చెరు
దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే యువత భాగస్వామ్యం కీలకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణ పరిధిలోని గోనెమ్మ బస్తి లో నూతనంగా నిర్మించిన నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అన్నారు. చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గారు, మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు ఉప్పరి నర్సింలు, గుండమల్ల రాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు.