రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించిన _చిట్కుల్‌ సర్పంచ్‌ నీలం మధు ముదిరాజ్‌

Districts politics Telangana

మనవార్తలు , పటాన్ చెరు:

క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న సహకారంతో ఉన్నత క్రీడాకారులుగా ఎదగాలని చిట్కుల్‌ సర్పంచి నీల మధు ముదిరాజ్‌ తెలిపారు. రామచంద్రాపురానికి చెందిన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ హరిబాబు పిల్లలు కారుణ్య, హర్షవర్ధన్‌లు రెజ్లింగ్‌ పోటీల్లో గోల్డ్‌ మెడళ్లు సాధించిన సందర్భంగా చిట్కుల్ గ్రామ సర్పంచ్‌ నీలం మధు ముదిరాజ్‌ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను శాలువాకప్పి ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడాకారుల ఉన్నతి కోసం ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు.

ఓపెన్‌ కేటగిరిలో కారుణ్య ఈనెల 18 నుంచి 20 తేదీ వరకూ అత్తాపూర్‌లో 3 వ సర్ధార్‌ వల్లభాయి పటేల్‌ మహిళా రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుని, గోల్డ్‌మెడల్‌ సాధించడం గర్వకారణం అన్నారు. అలాగే హర్షవర్థన్‌ నవంబర్‌ 29 న అండర్‌ 15 విభాగంలో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో 52 కేజీల కేటగిరిలో గోల్డ్‌ మెడల్‌ సాధించాడని తెలిపారు. అంతేకాక ఈనెల 15, 16 తేదీల్లో జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలో జరిగిన నేషనల్‌ ఓపెన్‌ కేటగిరిలో జాతీయ స్థాయి పోటీల్లో 5 స్థానం గెలుచుకున్నారని, ఇలాంటి పిల్లలను కన్న తల్లి దండ్రులు అదృష్ట వంతులని చిట్కుల్‌ సర్పంచ్‌ నీలం మధు ముదిరాజ్‌ తెలిపారు. క్రీడలకు, క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తుంటానని నీల మధు ముదిరాజ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *