మన వార్తలు ,నారాయణపేట
ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.లేదా విద్యా వాలంటీర్లను నియమించాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు S సాయికుమార్ అన్నారు.నారాయణపేట జిల్లా కోస్గి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి గారికి పిడిఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అకడమిక్ ఇయరులో ప్రభుత్వ పాఠశాలలో వందల సంఖ్యలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, తల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని,ఉన్న కొంతమంది టీచర్స్ విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఇబ్బందిపడుతున్న పరిస్థితి.ప్రభుత్వ పాఠశాలలో ఉన్నదని అన్నారు.
విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రతి పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థుల సంఖ్యకు అనుగునగా ఉపాధ్యాయులను నియమించాలని,ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని.లేదా తక్షణమే విద్య వాలంటీర్లను లను నియమించి విద్యార్థులు నష్టపోకుండా చూడాలని, ప్రభుత్వ పాఠశాలలో,స్కావెంజర్ లను తీసి.గ్రామపంచాయతీ వర్కర్లకు చెప్పడంతో ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత లేదని రద్దు చేసిన,స్కావెంజర్ ల ను నియమించాలని. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రంను కోసిగి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి అందజేశారుఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా కోశాధికారి గౌస్,జిల్లా నాయకులు శ్రీహరి, మండల అధ్యక్షుడు శ్రీను,కార్యదర్శి అంజి,నాయకులు శ్రీను,చక్రపాణి,రాము తదితరులు పాల్గొన్నారు.