చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సత్య సాయిబాబా జన్మదిన. వేడుకలు

Districts politics Telangana

మనవార్తలు, శేరిలింగంపల్లి :

మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో గల సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ సత్య సాయి బాబా వారి 96 వ జన్మదినం సందర్భంగా జరిగిన అన్నదానం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు.

అనంతరం మాట్లాడుతూ సత్యసాయి సామాన్య కుటుంబంలో జన్మించారు. అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం సృష్టికర్తగా ఎదిగారు. బాబా బోధనలు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటాయి. మానవులు అరిషడ్వర్గాలను జయించి ఉత్తములుగా ఉండాలని, పరిశుధ్ధ హృదయంతో జీవించాలనీ తమ ఉప న్యాసాల్లో బోధిస్తుంటారు.సత్య సాయి సేవా సంస్థల అధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలు నిరంతరాయంగా నేటికీ జరుగుతుండటం విశేషం. పేద విద్యార్ధులకు సహకరించడం,వైద్య సేవలు, అనేక విధాలైన దాన కార్యక్రమాలు నేటికీ నిరాటంకం గా నడుస్తున్నాయి అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వాల హరీష్ , బి ఎస్ ఎన్ కిరణ్ యాదవ్ , మాధవరం గోపాల్ రావు,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *