మన వార్తలు ,పటాన్చెరు:
కార్త్తిక పౌర్ణమిని పురస్కరించుకొని పటాన్చెరు లోని వేకువా జామునే నుంచే శివాలయాలన్ని కిటకిట లడాయి భక్తులు ఉదయం నుంచే దైవదర్శనాలు చేసుకొని దీపాలు వెలిగించారు కోరిన కోరికలు తీరాలని వేడుకున్నారు పటాన్చెరు మండలం లో ఇస్నాపుర్ గ్రామంలో గల శివాలయంలో గడ్డం బాలమని శ్రీశైలం (సర్పంచ్ మరియు యంపిటిసి) అధ్యరంలో నిర్వహించిన లక్ష దీపోస్తావం లో పాల్గొని శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు అనంతరం దీపాలు వెలిగించారు.
అనంతరం గోదావరి అంజి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవా భక్తిని అలవర్చుకోవాలని మహిళలు కార్త్తిక పౌర్ణమిని అత్యంత నిష్టగా దీపాలు వెలిగిస్తారని ఇలా చేయడం వలన పుణ్యఫలం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం అందుకోసమే కార్తీక పౌర్ణమి రోజున మనం ఏ దేవాలయాలు చూసినా ఇసుకేస్తే రాలనంత జనాలతో కిక్కిరిసి పోయి ఉంటాయి ఈ లక్ష దీపోస్తావంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని గోదావరి అంజిరెడ్డి అన్నారు.