ఈటెల రాజేందర్ గెలుపుతో అలాదుర్గం బిజెపి కార్యాలయం లో సంబరాలు

Districts politics Telangana

మనవార్తలు,మెదక్ :

ఈటెల రాజేందర్ గెలుపుతో మెదక్ జిల్లా  అల్లాదుర్గం మండల కేంద్రంలో బిజెపి కార్యాలయం ముందు బిజెపి నాయకులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కాల రాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ ఈటల రాజేందర్ గెలుపు సందర్భంగా ఆనందోత్సాహాల్లో సంబరాలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల భారీ మెజారిటీతో గెలిచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు .

తెరాస ప్రభుత్వం బిజెపి పై తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు అర్థం చేసుకొని బిజెపి చేస్తున్న పరిపాలన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను చూసి ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలుపొందడం హర్షదాయకం అని అన్నారు. ఈ గెలుపు టిఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టులాంటిది అన్నారు.

ఈటల రాజేందర్ 20 వేల మెజారిటీతో ప్రత్యర్థి అయిన టిఆర్ఎస్ అభ్యర్థి పై భారీ మెజార్టీతో గెలుపొందిన టిఆర్ఎస్ కు దిమ్మతిరిగేలా చేసిందన్నారు. బిజెపిని వ్యతిరేకించే వారికి ఇదే గతి పడుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపి అన్ని స్థానాల్లో గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ కు భారీ మెజార్టీ ఇచ్చిన హుజురాబాద్ ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా సెక్రెటరీ రవి, శామయ్య, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *