మనవార్తలు, పటాన్ చెరు :
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్నటువంటి హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం లక్ష రూపాయల విరాళం అందించిన పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు .సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నాగేష్ ముదిరాజ్ నిర్మిస్తున్నటువంటి కాంస్య విగ్రహం కోసం తన వంతు విరాళంగా లక్ష రూపాయల నగదు తన కార్యాలయంలో అందజేసారు.
అనంతరం దేవేందర్ రాజు మాట్లాడుతూ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామిహైదరాబాద్ కు తోలి డిప్యుటి మేయర్గా 1955లో ఎన్నికయ్యారు. ఈ హోదాలో అనేక కమిటీలకు సహాదారుగా పని చేశాడు. 1957లో మేయర్గాఎన్నికైనారు. కృష్ణస్వామి స్వాతంత్య్రానంతర హైద్రాబాద్కు మొదటి మేయర్ గా పని చేశారు. 1957లో హైదరాబాద్ నాలుగో మేయర్గా ఎన్నికైన తర్వాత రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దీర్ఘ దృష్టి ఆయనది.
అని సంపాదన పై ఆశ లేక, ప్రజాసేవే పరమార్థంగా, ఉన్న ఇల్లును కూడా అమ్ముకొని ప్రజా జీవితంలో మచ్చలేని జీవితం గడిపాడు అని మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు అన్నారు ఈ కార్యక్రమంలో పటేల్ గూడా ఉపసర్పంచ్ జానకి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేష్ ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, వేణుగోపాల్ ముదిరాజ్, జిన్నారం మండల మాజీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు భవాని రమేష్, ముదిరాజ్, మోత కృష్ణ ముదిరాజ్, బిక్షపతి ముదిరాజ్, రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.