రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Crime Districts Telangana

మనవార్తలు , మునిపల్లి:

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ముంబై జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.కర్ణాటక ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ముంబై జాతీయ రహదారిపై అదుపు తప్పి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే మునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *