హనుమాన్ దేవాలయానికి మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు లక్ష రూపాయల విరాళం.

Districts Telangana

పటాన్ చెరు

ఆపదలో ఉన్నవారికి ఆదుకొంటు అడిగిన వారికి లేదు అనకుండా సహాయం చేస్తూ సేవే లక్ష్యంగా ముందుగు సాగుతున్న పటాన్ చెరు మాజీ సర్పంచ్ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు.దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండే దేవేందర్ రాజు మరోసారి తన దైవభక్తిని చాటుకున్నారు .సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని పటేల్ గూడా గ్రామ పంచాయతీలో గల బి హెచ్ ఈ ఎల్ కార్మికుల కాలనీ కు సంబంధించిన మెట్రో ఎన్ క్లేవ్ మరియు ఇతర కాలనీల దారిలో

శ్రీ శ్రీ శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం నిర్మాణానికి పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ భక్తుని అలవాటు చేసుకోవాలి సూచించారు.

తద్వారా మనశ్శాంతిని పొందుతారని, రోజువారి నిర్వహించే పనుల్లో విజయవంతంగా ముందుకు పోయే అవకాశం ఉంటుందన్నారు. దేవుడి ఆశీస్సులతో మానసిక ప్రశాంతతతో ప్రతి ఒక్కరూ సుఖవంతమైన జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు. హనుమాన్ ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్, పటేల్ గూడా సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్, ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు దామోదర్ రెడ్డి, మెట్రో ఎన్ క్లేవ్, సూర్యోదయ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *