రామచంద్రాపురం
అర్హులైన భూమిలేని నిరుపేద కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని కేటాయించాలని బీఎస్పీ పటాన్ చెరు అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎస్ వినయ్ కుమార్ డిమాండ్ చేశారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బీఎస్సీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రామచంద్రాపురం, అమీన్ పూర్ ఎంఆర్ ఓ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. పేదలకు మూడు ఎకరాల భూమి కేటాయించాలని , పోడు భూములకు పట్టాలు కల్పించాలని,అసైన్డ్ భూములను ప్రభుత్వ నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఎమ్మార్వోలకు వినతి ప్రతం సమర్పించారు.
ధరణి పోర్టల్ లో అనుభవదారుడు కాలంను పునరుద్దరించాలని… భూ వివాదాల పరిష్కారానికి శాశ్విత ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు అసెంబ్లీ ఇంచార్జి సంజీవ , పటాన్చెరు అసెంబ్లీ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ , ఉపాధ్యక్షులు రాములు , అమీన్పూర్ కన్వీనర్ చెంద్ర శేఖర్ , తెల్లాపూర్ మునిసిపల్ ప్రెసిడెంట్ దర్శన్ , జనార్దన్ , శ్రీశైలం , రామకృష్ణ , శాంసన్ ,మధు తదితరులు పాల్గొన్నారు