17 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ
పటాన్చెరు
ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 17 లక్షల యాభై నాలుగు వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన డయాగ్నొస్టిక్ హబ్ ల ద్వారా ఖరీదైన వైద్య పరీక్షలు సైతం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. సీఎంఆర్ ద్వారా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పీటీసీ లు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, అఫ్జల్, గోవింద్, షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.