ఐనోల్ గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన

Hyderabad politics Telangana

పటాన్ చెరు 

గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషిచేయాలని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఐనోల్ గ్రామంలో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామ చౌరస్తా లో నూతనంగా ఏర్పాటు చేయనున్న చత్రపతి శివాజీ విగ్రహం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అన్నారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పాండు, పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, శంకర్ రెడ్డి, సర్పంచ్ పద్మ వెంకటేశ్, గ్రామ కమిటీ అద్యక్షులు మహేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ALSO REED

బాల్యం నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి_గూడెం మధుసూదన్ రెడ్డి

వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి _113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *