సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ బీజేపీ సీనియర్ నాయకులు మరియు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ 15వ రోజు పాదయాత్రలో భాగంగా హుజూజునగర్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని కలువడం జరిగింది. గత 15రోజులనుండి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్రలో బొల్లారం మున్సిపల్ నుండి తనకు అంగవైకల్యం వున్నా కూడా పార్టీ కోసం ఎదుగుదల కోసం చేపడుతున్న యాత్రలో తను పాల్గొంటున్నాడు. ఈ విషయంపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేసారు అలాగే ఆయన పడుతున్నా కృషి ని మెచ్చుకున్నారు.అనంతరం టీ. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసంగ్రామయాత్రకు వస్తున్న ఆదరణను టీఆరెఎస్ ఓర్వలేకపోతున్నారని , రాబోయే ఎలెక్షన్స్ లో బిజెపి జెండా ఎగరడం కాయమని టీ. రవీందర్ రెడ్డి తెలిపారు.
