అమీన్పూర్
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం కోటి రూపాయలతో వైకుంఠధామం నిర్మించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని టైలర్స్ కాలనీలో గల ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కోటి రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న వైకుంఠధామం నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. మనిషి జీవితంలో చివరి ప్రయాణాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్న లక్ష్యంతో వైకుంఠధామాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న వైకుంఠధామం లో ఆధునిక సౌకర్యాలతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.