హైదరాబాద్:
బీసీల బంధు పథకం సాధనకై ఇందిరా పార్క్ వేదిక వద్ద ఈ నెల 24 నాడు నిర్వహించనున్న బిసిల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిసి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు కోరారు.
జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ ల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని బి సి నాయకులు పాల్గొని బీసీల ధర్మ పోరాట దీక్షకు పెద్ద ఎత్తున బీసీ నాయకులు, యువజన సంఘాలు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కుల సాధనకై బీసీ సోదర సోదరిమణులు లందరూ ఐక్యమత్యంతో కలిసికట్టుగా ముందుకు నడవాలని తెలంగాణ బీసీల ధర్మపోరాటం దీక్ష విజయవంతం చేయాలని కోరారు.