పటాన్చెరు:
పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సినేషన్, టీకా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పౌండేషన్ గౌరవ సలహాదారు పృథ్వి రాజ్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. కరోనా సమయంలో వాళ్ల పాత్ర మరువువలేనిదిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రతి ఒక్కరిని కాపాడి తమ విధులను నిర్వహించి హ్`దేశానికే ఆదర్శనంగా నిలిచారని పౌండేషన్ గౌరవ సలహాదారు పృథ్వి రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్, కొండల్, ప్రభాకర్, తదితర సిబ్బంది, ఎండిఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, ప్రణీత్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.