పఠాన్ చేరు
బహుజన్ సమాజ్ పార్టీ దేశంలోనే రాజ్యాంగాన్నే ఏజెండాగా కలిగి ఉన్న ఏకైక పార్టీ అని అమీన్పూర్ మండల కన్వీనర్ సతీష్ అన్నారు.అమీన్పూర్ మండలం నియోజకవర్గంలోని సుమారు 60 మంది ,వివిధ సంస్థలో పనిచేస్తున్న ప్రముఖలు బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షులు సతీష్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బహుజన్ హక్కుల ప్రతిపాదకుడైన బి. ఆర్. అంబేద్కర్ వారి ముఖ్యమైన సైద్ధాంతిక ప్రేరణ.వివిధ కుల సంఘాలలో పనిచేయకుండా బహుజన రాజ్యాధికారం కోసం తమ పార్టీ లో చేరాలని సూచించారు.అలాగే బహుజన్ సమాజ్ పార్టీ దేశంలోనే రాజ్యాంగాన్నే ఏజెండాగా కలిగి ఉన్న ఏకైక పార్టీ అని, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ కావాలని అమీన్పూర్ మండల కన్వీనర్ సతీష్ పిలుపునిచ్చారు.

అనంతరం కార్యకర్తలు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ లో చేరి పార్టీ బలోపేతానికి రాష్ట్ర అభివృద్ధి కోసం మరియు దేశ అభివృద్ధి కోసం తమ వంతు కర్తవ్యం నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి జగదీష్,ఎన్.చంద్రశేఖర్, ఎం. పృథివిరాజ్, బి.వంశీకృష్ణ, ఎన్. కృష్ణ, కే.ప్రమోద్, కే.ప్రదీప్ ,జిల్లా సెక్రటరీ సంజీవ్ , పటాన్చెరు అసెంబ్లీ అధ్యక్షులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
