పటాన్ చెరు:
ముస్లిం సోదర, సోదరీమణులకు తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం కొరకు తెలంగాణ ప్రభుత్వం షాది ముబారక్, ప్రత్యేక గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీం, ఉర్దూ భాషను మొదటి లాంగ్వేజ్ ఆప్షన్ భాషగా గుర్తింపు, ఉర్దూలో డీఎస్సీ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. బక్రీద్ ను ఆనందోత్సాహాల మధ్య కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ముస్లిం సోదరీ, సోదరీమణులకు ఆయన తెలిపారు.