పటాన్ చెరు
మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రెండు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందచేశారు.
మండలం ముత్తంగి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి గత కొంత కాలంగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా, రెండు లక్షల రూపాయల ఎల్వోసీ మంజూరైంది.
ఈ మేరకు గురువారం సాయంత్రం నరసింహారెడ్డి కుటుంబీకులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఎల్వోసీ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.