మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గా శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్, రాయదుర్గం కు చెందిన ఆవుల రవీందర్ ను అధిష్టవర్గం నియమించినట్లు రవీందర్ తెలిపాడు. రవీందర్ తండ్రి గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ గా ఉన్నప్పుటికంటే ముందు నుండే రవీందర్ కాంగ్రెస్ పార్టీ కి ఎంతో సేవ చేశాడు. యువకుడిగా ఎల్లప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ కోసం పని చేస్తూ పార్టీ అభివ్రుద్ది కి కృషి చేస్తున్న రవీందర్ సేవలను గుర్తించి జిల్లా సెక్రటరీ గా నియమించిందని తెలిపాడు. పార్టీ తన సేవలను గుర్తించి, తనకు ఈ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠవర్గానికి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అహర్నిశలు పార్టీకి సేవ చేస్తూ, ప్రజల కు అందుబాటులో ఉంటూ పార్టీ ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత రెట్టింపు ఉత్సాహం తో పని చేస్తానని తెలిపాడు.
