ప్రతి సమస్యను పరిష్కరిస్తాం అభివృద్ధిలో ప్రతీకగా తీర్చిదిద్దుతాం

politics Telangana

ప్రతి సమస్యను పరిష్కరిస్తాం.. అభివృద్ధిలో ప్రతీకగా తీర్చిదిద్దుతాం

బీరంగూడ, అమీన్పూర్ డివిజన్ల లో సుడిగాలి పర్యటన

త్వరలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : 

అమీన్పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బుధవారం ఉదయం అమీన్పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని తులసివనం కాలనీ, భ్రమరాంబిక నగర్ కాలనీ, ఏ ఆర్ బృందావన్ కాలనీ, కె ఎస్ ఆర్ కాలనీ, అంజనాద్రి కాలనీ, టైలర్ కాలనీ, ఎన్ ఎస్ ఎల్ కాలనీ, ఎన్ బి ఆర్ కాలనీ, ఇక్రిశాట్ కాలనీలలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు.

నేరుగా ప్రజలు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశమై క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సీసీ రోడ్లు, యూజిడీలు, విద్యుత్, తాగు నీరు తదితర అంశాలపై చర్చించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను నివేదిక రూపంలో తనకు అందించాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయించి నిర్దేశించిన గడువుగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు.అమీన్పూర్ పరిధిలో దశాబ్దాల కాలంగా అపరిస్కృతంగా ఉన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టడంతో పాటు.. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. నూతన కాలనీలకు సైతం అందించేందుకు ఇప్పటికే ప్రణాళికలు పూర్తయ్యాయని తెలిపారు.కాలనీలలో ప్రభుత్వ స్థలాలు పార్కులు కబ్జాలు గురికాకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు.పారిశుద్ధ్య విషయంలో ప్రజలకు ఇబ్బందులకు తలెత్తకుండా నూతన సిబ్బందిని సైతం నియమిస్తున్నట్లు తెలిపారు.నూతన కాలనీలు ఏర్పడడంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని,ఇందుకు అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లతోపాటు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడటం తన నైజం అని మిగతా సమయం ప్రజల అభివృద్ధి సంక్షేమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.అభివృద్ధిలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని అవసరమైన నిధులు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.అతి త్వరలో బీరంగూడలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనన్నట్లు తెలిపారు.తమ సమస్యల పరిష్కారానికి నేరుగా ఎమ్మెల్యేనే స్వయంగాతమ కాలనీలకు రావడం పట్ల ఆయా కాలనీల ప్రతినిధులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు బాలరాజు, కృష్ణ, యూనుస్, ఇంజనీరింగ్ విభాగం ఈఈ సురేష్ డిఈ వెంకటరమణ, జలమండలి డిజిఎం శివకుమార్, విద్యుత్ శాఖ ఏడి సంజీవ్, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *