కార్మిక కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

గుండెపోటుతో మరణించిన కార్మికుడి కుటుంబానికి 5 లక్షల 50 వేల రూపాయల నష్టపరిహారం అందజేత..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

కార్మిక రంగానికి పెద్దపీటవేస్తూ వారి సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తున్న పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరో సారి కార్మిక రంగం పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. గుండెపోటుతో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం అందించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో గల స్మార్కో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కాంటాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న కృష్ణారెడ్డి (35) మూడు రోజుల క్రితం పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. అత్యంత నిరుపేద కుటుంబం నేపథ్యం కలిగిన కృష్ణారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన పరిశ్రమ యాజమాన్యం 5 లక్షల రూపాయలు నష్టపరిహారంతో పాటు 50 వేల రూపాయలు అంత్యక్రియల ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం పటాన్‌చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం డబ్బులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక నేపద్యం నుండి రాజకీయాల్లోకి వచ్చిన తనకు కార్మికుల కష్టనష్టాలు తెలుసునని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కార్మిక రంగానికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఐలా పటాన్‌చెరు అధ్యక్షులు సుధీర్ రెడ్డి, పాశమైలారం వైస్ చైర్మన్ రాఘవరెడ్డి, ప్రతినిధులు ఆనంద్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్, రమణారెడ్డి. లక్ష్మణరావు, సురేష్. రంజిత్, సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, చంద్రశేఖర్, మధు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *