సమాజంలో సమానత్వాన్ని పెంచేది విద్య  పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

విద్యా భారతి పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి 20 లక్షల రూపాయల భారీ విరాళం

మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:

విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనమని సమాజ అభివృద్ధికి వ్యక్తిగత ఎదుగుదలలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో గల విద్యా భారతి పాఠశాలలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను సోమవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు జాతీయ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించడంలో విద్యా భారతి సంస్థల కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానంలోనూ సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ ను సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యా భారతి సంస్థ దక్షిణ క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, భారతీ విద్యా సమితి అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, కార్యదర్శి రవి, టప్ప కుమార్, సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *