విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే…
పటాన్ చెరు:
పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపుర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా దేవాలయం లో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… దేవాలయాల అభివృద్ధికి నేను ఎప్పుడు ముందు ఉంటానని నియోజక వర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ,ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహిపాల్ రెడ్డి అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ బాలమనిశ్రీశైలం, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, స్థానిక నాయకులు, ఆలయ కమిటీప్రతినిధులు పాల్గొన్నారు.
