మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని నీలం ఇంజెటిని డాక్టరేట్ వరించింది. ‘ప్రయోగాత్మక జంతువులలో నాడీ సంబంధిత రుగ్మతలకు వ్యతిరేకంగా సంభావ్య మూలికల యొక్క న్యూరోప్రొటెక్టివ్ ప్రభావం’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ పరిశోధన అల్జీమర్స్ వ్యాధిని పరిష్కరించడంలో ఔషధ మొక్కల యొక్క న్యూరోప్రొటెక్టివ్ సామర్థ్యాన్ని అన్వేషించినట్టు తెలియజేశారు. సాంప్రదాయకంగా మూలికా వైద్యంలో ఉపయోగించే మొక్కలైన ఇండిగోఫెరా ప్రోస్ట్రాటా, లాంటానా కమారా యొక్క ఫైటోకెమికల్, చికిత్సా లక్షణాలపై ఈ అధ్యయనం దృష్టి సారించిందన్నారు.సిలికో మాలిక్యులర్ డాకింగ్, జీసీ-ఎంఎస్ విశ్లేషణ, ప్రయోగాత్మక జంతు అధ్యయనాలలో అధునాతనమైన పురోగతి ద్వారా, పరిశోధన అమిలాయిడ్-బీటా, ఎసిటైల్ కోలినెస్టెరేస్ తో సహా కీలకమైన అల్జీమర్స్ వ్యాధి లక్షణాలతో మొక్కల నుంచి ఉత్పన్నమైన సమ్మేళనాల యొక్క ఆశాజనక పరస్పర చర్యలను ప్రదర్శించినట్టు వివరించారు. ప్రయోగాత్మక నమూనాలలో గణనీయమైన యాంటీఆక్సిడెంట్ కార్యకలాపాలు, జ్జాపకశక్తి, అభ్యాసంలో మెరుగుదల కూడా ఈ పరిశోధన ఫలితాలు తేల్చాయని, ఇది మొక్కల బలమైన న్యూరోప్రొటెక్టివ్ సామర్థ్యాన్ని వెల్లడిస్తోందన్నారు.ఈ మూలికా వనరులు అల్జీమర్స్ వ్యాధికి కొత్త చికిత్సా విధానాల అభివృద్ధికి దోహదపడతాయని, తదుపరి క్లినికల్ పరిశోధనలను ప్రోత్సహిస్తాయని అధ్యయనం సూచిస్తున్నట్టు తెలిపారు.డాక్టర్ నీలం సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
)
