రెండో రోజు కొనసాగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ క్రీడోత్సవాలు

politics Telangana

రేపు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వేలాది మంది మహిళలతో నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవ వేడుకలు.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని.. పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా ఏర్పాటు చేసిన మహిళా క్రీడోత్సవాలు రెండో రోజు ఘనంగా కొనసాగాయి. ఎమ్మెల్యే జిఎంఆర్ గారు గూడెం యాదమ్మ గారితో కలిసి స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పటాన్చెరు పట్టణం వేదికగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిత్యం కుటుంబ నిర్వహణ, ఉద్యోగం వంటి బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా ఉండే మహిళల కోసం క్రీడోత్సవాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 12వ తేదీ గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల పరిధిలోని మహిళలందరూ వేడుకల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రీడోత్సవాల్లో విజేతలుగా నిలిచిన వారందరికీ బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజయ్ కుమార్, విజయ్ భాస్కర్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, హారిక విజయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *