ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎం.అనూషకు పీహెచ్.డీ.

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని ఎం.అనూషను డాక్టరేట్ వరించింది. ‘బయోలాజికల్ మ్యాట్రిక్స్ లో ఎంచుకున్న ఔషధాల అంచనా కోసం ఎల్సీ-ఎంఎస్/ఎంఎస్ పద్ధతుల అభివృద్ధి, ధ్రువీకరణ’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంరెడ్డి గొడెల మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.అనూష పరిశోధన, మానవ ప్లాస్మాలో క్యాన్సర్ నిరోధక ఔషధాలైన అస్కిమినిబ్, ఫ్రక్విన్టినిబ్, లుర్బినెక్టెడిన్ లను లెక్కించడానికి సున్నితమైన ఎల్సీ-ఎంఎస్/ఎంఎస్ పద్ధతులను అభివృద్ధి చేసి ధృవీకరించినట్టు తెలియజేశారు. ధృవీకరించబడిన పద్ధతులు అద్భుతమైన ఖచ్చితత్వం, ఖచ్చితత్వంతో పాటు స్థిరత్వాన్ని చూపించాయన్నారు. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండడంతో పాటు, ఫార్మకోకైనెటిక్, జీవ లభ్యత, క్లినికల్ అధ్యయనాలకు అనుకూలతను ప్రదర్శించాయని వివరించారు.అనూష సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.శివకుమార్, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *