రామాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ భారీ విరాళం

politics Telangana

పటాన్‌చెరు ఏపీఆర్ లగ్జూరియా కమ్యూనిటీలో రామాలయ నిర్మాణ పనుల పరిశీలన

నూతన దేవాలయం నిర్మాణాలకు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం

ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు మరోమారు తన దైవభక్తిని చాటుకున్నారు. ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం, శివాలయం దేవాలయాల నిర్మాణానికి 75 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. బుధవారం ఉదయం కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని కోరారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటివరకు 200కు పైగా దేవాలయాలను సొంత నిధులతో నిర్మించినట్లు గుర్తు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *