కొత్తపేట లో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ 2వ స్టోర్ ను ప్రారంభించిన టాలీవుడ్ నటివైష్ణవి చైతన్య

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

కొత్తపేటలో నూనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ 2వ స్టోర్ ను టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య ఆదివారం నాడు ప్రారంభించారు. నటిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్రాంతమంతా కోలాహలంగా కనిపించింది. అభిమానులకు వైష్ణవి చేతన్య హాయ్ అంటూ పలకరిస్తూ సందడి చేశారు. స్టోర్ వెలుపల ఆభరణాల కలెక్షన్స్ ను తిలికిస్తూ, ఆమె కలవడిగా తిరిగారు. ఈ సందర్భంగా నటి వైష్ణవి చైతన్య మాట్లాడుతూ, గోల్డ్ అండ్ డైమంజ్ జ్యూవెలరీ ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారన్నారు. ఇక వెడ్డింగ్ కలెక్షన్ కు విశిష్ట కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్నారు. తాను కూడా లైట్ వెయిట్ డైమండ్ జ్యూవెలరీ అంటే ఎంతో ఇష్టపడతానన్నారు. ఇక విశిష్ట లో విభిన్నంగా, సంప్రదాయ శైలిని ఆధునికతతో సమ్మిళితంగా చేసిన డిజైన్లు తనను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. విశిష్ట సీఈఓ, డైరెక్టర్ సిందుజా, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, “ప్రతి ఆభరణాన్ని అత్యున్నత నైపుణ్యం కలిగిన కారిగులు శ్రద్ధతో డిజైన్ చేసినట్లు వివరించారు. ప్రతి డిజైన్ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *