విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన
– ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్ చెరు:
పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో వచ్చే నెల 5వ తేదీన నిర్వహించిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు పాండు, రుద్రారం ఎంపీటీసీ రాజు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆలయ కమిటీ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.