పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శివాజీ మహారాజ్ 395వ జయంతిని పురస్కరించుకొని.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం గ్రామంలో గల శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. భవిష్యత్ తరాలకు శివాజీ ఆదర్శాలను అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలు, పట్టణాల పరిధిలో సొంత నిధులతో విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, గ్రామస్తులు వీరేశం గౌడ్, సంతోష్, భవేశ్, సందీప్, వేణుగోపాల్, వినోద్, బలరాం, అజయ్, నవీన్ రెడ్డి, లక్ష్మణ్, శివ, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.