జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన జిఎంఆర్ ఆరోగ్య బీమా

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కోసం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అందించిన వ్యక్తిగత ఆరోగ్య భీమా జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచింది.రామచంద్ర పురానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కుమారుడు సుమంత్ రాజ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ అందించిన ఆరోగ్య భీమా ద్వారా సుమారు 12 లక్షల 50 వేల రూపాయల ఆరోగ్య భద్రత సహాయం అందింది. గత సంవత్సరం క్రితం సైతం ఇదే జర్నలిస్టు కుటుంబ సభ్యులకు సుమారు 6 లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమా పొందారు.ఈ సందర్భంగా జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే అందించిన ఆరోగ్య భీమా ద్వారా తన కుమారుడు పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడని జర్నలిస్ట్ ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *