పోరాటయోధుడు పండగ సాయన్న నీలం మధు ముదిరాజ్

politics Telangana

భూస్వాములకు రజాకర్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మర్చిపోలేనిది 

ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం 

సొంత నిధులతో పండగ సాయన్న విగ్రహం 

రాయిని పల్లి లో విగ్రహావిష్కరణ కార్యక్రమం

భారీ బైక్ ర్యాలీ,మంగళ హారతులతో స్వాగతం పలికిన గ్రామస్థులు 

తెనుగోలా సాయన్న ను ఊరూరా ప్రతిష్టించి తెలంగాణ సాయన్నగా తీర్చిదిద్దుదాం 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నిజాం రజాకర్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండగ సాయన్న అని నీలం మధు ముదిరాజ్ అన్నారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పాన్ గల్ మండలం రాయిని పల్లి గ్రామంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన పండగ సాయన్న విగ్రహాన్ని ఆయన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూపేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని భూస్వాముల నుంచి ఆహార ధాన్యాలు దోచి పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడని కొనియాడారు. ఆకలితో అల్లాడుతున్న గ్రామాలలో పండగ సాయన్న అడుగు పెడితే వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత వల్లే సాయన్న కు పండగ సాయన్న పేరు వచ్చిందన్నారు. ఈ మహానీయుడు బంధుక్ ఎత్తి రజాకర్ల అన్యాయాలను ఎదిరించి ఎదురొడ్డి నిలిచి బహుజనులకు అండగా నిలిచాడని గుర్తు చేశారు. అలాంటి మహావీరుడు స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు పోరాటాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.పండగ సాయన్న సేవలను భావితరాలకు తెలియజేయాలని సంకల్పంతో పండగ సాయన్న విగ్రహలను ఊరూరా నెలకొల్పుతామని తెనుగోలా సాయన్న ను తెలంగాణ సాయన్నగా తీర్చిదిద్దుతాం అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు పాలమూరు యూనివర్సిటీ కి పండగ సాయన్న పేరు పెట్టేలా చూడాలని ఆయన దృష్టికి తీసుకుని రాగా అందుకు సానుకూలంగా స్పందించిన నీలం మధు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి అయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో డా పగిడాల శ్రీనివాసులు, బెక్కం జనార్ధన్, పండగ సాయన్న వారసులు యాదయ్య,నర్సింలు, సభాధ్యక్షులు శివ ప్రసాద్, దర్గేష్,నాయకులు మమత గౌడ్, పెబ్బేటి మల్లికార్జున్, వెంకటస్వామి,వాకిటి ఆంజనేయులు, చెన్న రాములు, పుట్ట బలరాజు, మెట్టుకాడి శ్రీనివాస్,కృష్ణ, పండగ సాయన్న విగ్రహ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *