విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన డైట్ మెనూ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం మొట్టమొదటిసారి కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యను అభ్యసించాలని కోరారు. ప్రతి ఏటా ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయల పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలను ప్రభుత్వం బలోపేతం చేస్తూందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవూజ, పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *