మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
హతీయ బీసీ సంక్షేమ సంఘం శేరిలింగంపల్లి మహిళా అధ్యక్షురాలిగా వై. లక్ష్మి ని నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ తెలిపారు. జాతీయ అధ్యక్షులు, మాజీ రాజ్య సభ సభ్యులు అర్. కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న లక్ష్మి మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు అర్. కృష్ణయ్య కు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ ముదిరాజ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన వంతు బాధ్యత గా బీసీ ల అభివృద్ధికి కృషి చేస్తానని, బీసీ ల ఐక్యత కోసం పాటు పడతానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు వై. నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.