118 మంది లబ్ధిదారులకు 43 లక్షల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు మంజూరైన 43 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నగేష్ యాదవ్, నరసింహారెడ్డి, వెంకటేష్, రాము, రాజు, సంజీవరెడ్డి, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.