వడకపల్లి లో ఘనంగా శ్రీ సీతా రామచంద్రస్వామి, ఆంజనేయ విగ్రహాల ప్రతిష్టాపురం మహోత్సవం

politics Telangana

_దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి :

ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలం వడకపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ సీతారామచంద్రస్వామి, హనుమాన్ దేవాలయాల్లో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం జనకంపేట గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచులు లలిత మల్లేష్, పాండు యాదవ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *