శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గా శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ కు చెందిన శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ ను నియమించినట్లు ఆయన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి ఆదేశాలు జారిచేయగా, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ సురేష్ ముదిరాజ్ కు నియామక పత్రం అందజేశారు.తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన జిల్లా అధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్థానాన్ని ఆయన తెలిపారు.